ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > రైడర్లపై దృష్టి సారించిన యాంటీ డోపీంగ్ ఏజెన్సీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రైడర్లపై దృష్టి సారించిన యాంటీ డోపీంగ్ ఏజెన్సీ
ఈ ఏడాది ప్రారంభం కానున్న వార్షిక సైకిల్ పోటీలు టూర్ డీ ఫ్రాన్ టోర్నీలో పాల్గొననున్న రైడర్లపై ఫ్రెంచ్‌ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (ఏఎఫ్ఎల్‌డీ) దృష్టి సారించింది. ఈ విషయాన్ని ఏఎఫ్ఎల్‌డీ అధ్యక్షుడు పియరీ బోర్డ్‌రి వెల్లడించారు.

పారిస్‌లో విలేకరులతో పియరీ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో డోపింగ్ సంఘటనలు తరచుగా వెలుగుచూస్తుండటంతో ఈ టూర్‌లో అలాంటి తరహా అంశాలు రాకుండా చూస్తున్నామన్నారు. ఇందుకోసం సరికొత్త పరీక్షలను తమ ఏజెన్సీ ప్రణాళిక చేస్తోందన్నారు.

డోపింగ్‌కు పాల్పడతారనుకుంటున్న రైడర్స్ జాబితా ఫ్రెంచ్ ఎజెన్సీ వద్ద ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తమ ఏజెన్సీ డైరెక్టర్లకు డోపింగ్ సంబంధిత పరీక్షలు చేయడం బాగా తెలుసున్నారు. అయితే ఈ డోపింగ్ ఏజెన్సీ జాబితాలో ఎవరున్నారు ? లేదా ఇందులో ఎంత మంది ఉన్నారనే దానిపై ఆయన వ్యాఖ్యానించలేదు.

కానీ, అంతర్జాతీయ సైక్లింగ్ యూనియన్ అధ్యక్షుడు పాట్ మెక్‌క్వాడ్ మాట్లాడుతూ, ఈ జాబితాలో 50 మంది రైడర్లు ఉన్నారని తెలిపారు. కాగా, గత ఏడాది యూనియన్ సైక్లిస్ట్ ఇంటర్నేషనల్ (యూసీఐ) మరియు ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (డబ్ల్యూఏడీఏ)లు సంయుక్తంగా ప్రొఫెషనల్ రైడర్లు అందరి నుండి రక్తపు నమూనాలను సేకరించారు. దీని ద్వారా ప్రతి రైడర్‌కు సంబంధించిన మెడికల్ ప్రొఫైల్ లేదా పాస్‌పోర్ట్‌లను రూపొందిస్తారు. అక్కడ రిజిష్టర్ అయిన డేటాను డోపింగ్ పరీక్షల సమయంలో పోల్చి చూస్తారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇస్తోనియా వరల్డ్ అథ్లెటిక్స్‌లో షాజీకి రజతం
పోరాడి ఓడిన ప్రకాశ్ జోడీ: క్వార్టర్స్‌లో మహేశ్ జోడీ
పసిడి పతక విజేతలకు రూ. 10 లక్షల ప్రైజ్‌మనీ
వింబుల్డన్ ఓపెన్: క్వార్టర్స్‌కు చేరుకున్న ఫెదరర్
జర్మన్ గ్రాండ్ ప్రిక్స్‌లో సుషీల్‌కు స్వర్ణం
పాత పాఠాలను నెమరువేసుకుంటున్న ఇవనోవిక్