ఇటీవలే ప్రారంభమైన వింబుల్డన్ ఓపెన్ జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నీలో భారత సవాలు ముగిసింది. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండులో జరిగిన మ్యాచ్లో భారత్కు చెందిన అన్సీడెడ్ క్రీడాకారుడుగా బరిలోకి దిగిన సుదార్వా సీతారామ్ ఓటమి పాలయ్యాడు.ఆస్ట్రేలియాకు చెందిన బెర్నార్డ్ టామిక్ చేతిలో సుమారు 42 నిమిషాలు పోరాడి 2-6, 2-6తో సీతారామ్ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. తొలి సెట్ నుండి సీతారామ్పై బెర్నార్డ్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచాడు. దీంతో బెర్నార్డ్ విజయం కోసం పెద్దగా కష్టపడలేదు.మరోవైపు ఈ టోర్నీలో భారత్కు చెందిన టెన్నిస్ యువ కెరటం, ఆస్ట్రేలియా జూనియర్ ఓపెన్ టైటిల్ విజేత యూకీ బాంబ్రీ పాల్గొనలేకపోయాడు. తన ర్యాంకును మెరగుపరుచుకునే దిశలో ప్రస్తుతం జరుగుతున్న ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీలో యూకీ ఆడుతున్నాడు. |