సింగపూర్లో జరుగుతున్న ఆసియా యూత్ గేమ్స్లో భారత్ మరో మూడు పతాకలు సాధించింది. తొలి రోజు ఒక స్వర్ణ పతకంతో పాటు మూడు పతకాలు సాధించిన భారత్కు రెండో రోజు నిరాశే మిగిలింది. అయితే మూడో రోజైన గురువారం మాత్రం భారత్ ఆటగాళ్లు పుంజుకుని గట్టిపోటీని ప్రదర్శించడంతో మళ్లీ భారత్ ఖాతాలో మూడు పతకాలు వేసుకుంది.
ఇందులో జావెలిన్లో రోహిత్ పతకం సాధించగా, బాలుర 400మీ హార్డిల్స్లో సెల్విన్ జెబ్రాజ్ 54.41 సెకన్లతో నిర్ణీత లక్ష్యాన్ని చేధించి రజతం గెలుచుకున్నాడు. ఇకపోతే.. చెంగ్డాంగ్ స్వర్ణం సాధించాడు.
ఇదేవిధంగా.. బాలికల 400మీ హార్డిల్స్లో సుష్మా కాంస్య పతకం కైవసం చేసుకుంది. దీంతో ఆసియా యూత్ గేమ్స్లో భారత్కు ఇప్పటివరకు ఆరు పతకాలు లభించాయి. |