ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > మంగళూరులో ఆల్ ఇండియా చెస్ టోర్నీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మంగళూరులో ఆల్ ఇండియా చెస్ టోర్నీ
FILE
కర్నాటక బ్యాంక్ ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ మంగళూరులో ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానుంది. ముగ్గురు గ్రాండ్ మాస్టర్లు, 16 మంది భారతీయ చెస్ మాస్టర్లతో పాటు దాదాపు 400మంది క్రీడాకారులు పాల్గొనే ఈ చెస్ టోర్నీని సౌత్ కనరా డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ (ఎస్‌కెడిసిఎ) నిర్వహిస్తోంది.

ఈ టోర్నీలో జిబి. ప్రకాష్, రత్నాకరన్, మాజీ జాతీయ ఛాంపియన్ బాలసుబ్రహ్మణ్యం, అక్షయ్ రాజ్ కోర్, మురళీకృష్ణ, మాజీ జాతీయ ఎ ఛాంపియన్ దినేష్ కుమార్‌లతో పాటు పలువురు ఛాంపియన్లు పాల్గొంటారని ఎస్‌కెడిసిఎ అధ్యక్షుడు గురురాజ్ చెప్పారు. దాదాపు 62 మంది భారతీయ చెస్ క్రీడాకారులు ఇందులో పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఇందులో గట్టిపోటీని ప్రదర్శించి విజేతగా నిలిచే చెస్ ఆటగాళ్లు ఆగస్టు 1 నుంచి 9వతేదీ వరకు దేశరాజధాని నగరమైన ఢిల్లీలో జరిగే ఆసియన్ యూత్ చెస్ ఛాంపియన్‌లో పాల్గొనే అవకాశముందని గురురాజ్ వివరించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
9 నుంచి జూనియర్ వ్రెస్ట్‌లింగ్ పోటీలు
వింబుల్డన్: టామీ హాస్‌తో ఫెదరర్ ఢీ నేడే!
డబుల్స్‌లో భారత్‌దే పైచేయి: సోమదేవ్
వింబుల్డన్: అక్కా చెల్లెళ్ల మధ్యే అంతిమ పోరు!
ఆసియా యూత్ గేమ్స్: భారత్‌కు 3 పతకాలు
వింబుల్డన్ టోర్నీ: భూపతి జోడీ నిష్క్రమణ