ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » మాంట్రియల్: సెమీస్లో భూపతి, నొవెల్స్ జోడీ (Other Sports | Tennis | Montreal Open | Semis | Bhupathi | Knowles | Frystenberg | Matkowski)
మాంట్రియల్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి, బహామాస్కు చెందిన అతని భాగస్వామి మార్క్ నొవెల్స్ జోడీ సెమీస్లోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీ క్వార్టర్స్లో జరిగిన మ్యాచ్లో పోలెండ్ జోడీ మారిజ్ ఫిర్స్టెన్బర్గ్, మార్సిన్ మాట్కోవస్కీపై 6-3, 6-4తో భూపతి, నొవెల్స్ జోడీ గెలుపొందింది.
క్వార్టర్స్లో గెలుపుతో.. భూపతి జోడీ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆరోసీడ్ పోలెండ్ ప్రత్యర్థితో సుమారు గంటకు పైగా పోరాడిన మూడో సీడ్ భూపతి, నొవెల్స్ జోడీ అద్భుతమైన సర్వ్లను చేసింది. అన్ని రకాలుగాను ఐదు బ్రేక్ పాయింట్లను భూపతి జోడీ కాపాడుకుంది. దీంతో విజయం తేలికైంది.