వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఢిల్లీ వాసులు నడవడిక మార్చుకోవాలి: కేంద్రం (Delhi | Commonwealth Games | Chidambaram)
 
దేశ రాజధాని వాసులు ప్రవర్తన మార్పుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం సూచించారు. వచ్చే ఏడాది దేశ రాజధాని కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీని అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చేందుకు కామన్వెల్త్ క్రీడలను సరైన అవకాశమని, దీనిని రాజధానివాసులు సద్వినియోగ పరచాలని చిదంబరం పేర్కొన్నారు.

దీనికి ఢిల్లీ పౌరులు నడవడిక మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. కామన్వెల్త్ క్రీడలను ఆతిథ్యం ఇవ్వబోతున్న ఈ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిరూపించాలంటే రాజధానివాసులు తప్పనిసరిగా వారి ప్రవర్తన మార్చుకోవాలన్నారు. రాజధానిలో తరుచుగా పౌరులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తుంటారు.

ఇటువంటి వ్యవహారశైలిని విడిచిపెట్టాలి. చాలా ఏళ్ల నుంచి మేము రాజధాని పౌరులను గమనిస్తున్నాము. వారు నడవడికను ఏమాత్రం మార్చుకోలేదు. రెడ్ సిగ్నల్ ఉన్న వాహనాలు ఆగవు.

ముఖ్యంగా పోలీసు వాహనాలు కూడా ఆగవు. కొన్ని వాహనాలు రిజిస్ట్రేషన్ ప్లేట్లు లేకుండానే తిరుగుతుంటాయి. వెళ్లకూడని ప్రదేశాల్లోనూ వాహనాలు తిరుగుతుంటాయి. పౌరులు ప్రత్యమ్నాయ మార్గాలను ఉపయోగించరు. ఇటువంటి ఇష్టారాజ్యం నుంచి పౌరుల నడవడికను మార్చాల్సివుందని చిదంబరం అభిప్రాయపడ్డారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.