వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఆసియా ఛాంపియన్‌షిప్‌కు ఆంధ్రప్రదేశ్ అర్హత (Sports| Asia Championship| Andhra Pradesh| Relay)
Feedback Print Bookmark and Share
 
జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ రిలే విభాగంలో ఆంధ్రప్రదేశ్ తన హవాను కొనసాగించింది. 4/100లో మహిళల జట్టు స్వర్ణం సాధించగా, పురుషుల బృందం కాంస్యం నెగ్గింది. అలాగే 4/400లో మహిళల జట్టు రజతం గెలిచింది.

శనివారం జరిగిన రిలే పోటీల్లో రెండు పతకాలు గెలిచిన సౌజన్య 400 మీటర్ల విభాగంలో టాప్-5స్థానంతో ఆసియా ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.

ఈ పోటీలు నవంబర్ 10-14 వరకు చైనాలో జరుగుతాయి. ఆఖరి రోజు పోటీల్లో సత్తి గీత, సుధ, సౌజన్య, జ్యోతిల బృందం 46.39 సెకన్లతో 4100 రిలేలో పసిడి పతకాన్ని నెగ్గింది. పురుషుల విబాగంలో ఆంజనేయులు, కృష్ణమోహన్, శ్రీనివాస్, ప్రసాద్‌ల జట్టు 42.40 సెకన్లతో కాంస్య పతకం గెలుపొందింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.