ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » హస్తినలో 28 నుంచి ప్రత్యేక ఒలింపిక్ పోటీలు (Sports| Special Olympics| New Delhi| Wasim Akram| Kapil Dev| Ajay Jadeja| Akshay Kumar)
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ఈ నెల 28వ తేదీ నుంచి ప్రత్యేక ఒలింపిక్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కార్నివల్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలు నవంబర్ ఒకటో తేదీ వరకు కొనసాగుతాయి. చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మలేషియా, నేపాల్ వంటి ఆరుదేశాలకు చెందిన జట్లతో పాటు భారత్ కూడా ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటుంది.
యువజన క్రీడా మంత్రిత్వశాఖ మరియు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక ఒలింపిక్ పోటీలకు.. ఒలింపిక్ పసిడి పతక విజేత రాజ్య వర్ధన్ సింగ్ రథోర్, మాజీ క్రికెటర్లు వాసిమ్ అక్రమ్, కపిల్ దేవ్, అజయ్ జడేజా మరియు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్లు బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతారు.