వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఆసియా గేమ్స్: జాతీయ పతాక ధారిణిగా మేరీ (Mary Kom | Indoor Asian Games | National Flag bearer | Baishya)
Feedback Print Bookmark and Share
 
హనోయ్‌లో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు జరిగే మూడవ ఇండోర్ ఆసియా క్రీడల్లో భారత పతాక ధారిణిగా నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్, ఖేల్ రత్నా అవార్డీ అయిన మహిళా బాక్సర్ మేరీ కామ్ వెళ్లనుంది. ఈ విషయాన్ని భారత ఛెప్ డీ మిషన్ బీపీ బైష్యా వెల్లడించారు.

విలేకరులతో బైష్యా మాట్లాడుతూ, భారత్ తరపున సుమారు 279 మంది సభ్యులు గల జట్టు ఈ క్రీడలకు వెళ్లనుందన్నారు. ఇందులో 179 మంది అథ్లెట్లు ఉన్నారన్నారు. ప్రపంచ ఛాంపియన్స్ క్యూయెస్ట్ పంకజ్ అద్వానీ సహా పలువురు ఆటగాళ్లు ఈ భారత జట్టుతో కలిసి వెళుతున్నారని తెలిపారు.

ఈ టోర్నీలో మొత్తం 19 వేర్వేరు క్రీడల్లో ఈ భారత జట్టు పాల్గొంటుంది. ఇందులో క్యూ స్పోర్ట్స్, చెస్, అథ్లెటిక్స్, మహిళల బాక్సింగ్, ఆర్చరీ, బాస్కెట్‌బాల్ ఉన్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.