ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » డిసెంబర్ 27 నుంచి క్యారమ్స్ ఫెడరేషన్ కప్ (Carroms Federation cup | December 27 | Ashok Singh | Lok Pati Tripathi)
వారణాసిలో డిసెంబర్ 27 నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు జాతీయ మరియు అంతర్జాతీయ 37వ సబ్ జూనియర్ మరియు 17వ ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ క్యారమ్స్ ఛాంపియన్షిప్ టోర్నీలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని ఈ టోర్నీ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు అశోక్ సింగ్ వెల్లడించారు.
వారణాసిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లోక్ పతి త్రిపాటీ సంస్మరణార్థం ఈ ఛాంపియన్షిప్స్ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఛాంపియన్షిప్లలో సుమారు 800 మంది ఆటగాళ్లు మరియు వంద మందికి పైగా అధికారులు పాల్గొననున్నట్లు వివరించారు.
జీవన్ దీప్ గ్రూపు ప్రాంగణంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఛాంపియన్షిప్లలో దేశవ్యాప్తంగా అనేక మంది కొత్త ఆటగాళ్లు పోటీ చేయనున్నట్లు తెలిపారు.