ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » సోనీ ఎరిక్సన్ టోర్నీలో సెరెనాకే టైటిల్ (Sports I News I Sony Ericsson ChampionShip Torni I Finals I Serena Williams I Venus Williams I)
ఈ సంవత్సరం చివరిదైన "సోనీ ఎరిక్సన్ ఛాంపియన్షిప్ టోర్నీ" ఫైనల్స్లో సెరెనా విలియమ్స్ 6-2, 7-6(4) స్కోరు తేడాతో తన సోదరి వీనస్ విలియమ్స్ను ఓడించి టైటిల్ను నిలబెట్టుకుంది. తొలి సెట్ సునాయాసంగా గెలిచిన సెరెనాకు.. రెండో సెట్లో వీనస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దాంతో ట్రైబ్రేకర్కు దారితీసింది. అయినప్పటికీ సెరెనా 7-4 స్కోరుతో గెలిచి సెట్ను, టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో సెరెనా ఖాతాలోకి 1.55 మిలియన్ డాలర్ల ఫ్రైజ్మనీ చేరింది.
కాగా.. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల పోరులో మరోసారి చెల్లెలిదే పైచేయి అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ ఏడాదిలోనే చెల్లెలి చేతిలో వీనస్ భంగపడటం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఇదే టోర్నీలో రౌండ్ రాబిన్ లీగ్లో అక్క వీనస్పై విజయం సాధించిన సెరెనా విలియమ్స్.. అంతకుమునుపు మియామీ టోర్నీలోనూ.. వింబుల్డన్ ఫైనల్స్లోనూ గెలుపొందింది.
ఈ సందర్భంగా సెరెనా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. 2001 సంవత్సరం తరువాత ఈ టోర్నీ గెలవడం ఇదే తొలిసారనీ... అక్కపై గెలవటం అంత సులువైన పని కాదని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే... ఈ టైటిల్ను సాధించినప్పటికీ, డబ్ల్యూటీఏ ర్యాంకుల్లో మాత్రం సెరెనా రెండో స్థానానికే పరిమితం అయ్యింది. తాజా ర్యాంకింగ్స్లో రష్యాకు చెందిన దినారా సఫీనా 7731 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... 7576 పాయింట్లతో సెరెనా తృటిలో నెంబర్వన్ ర్యాంకును చేజార్చుకుంది.