ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ప్రపంచ స్నూకర్లో భారత ఆటగాళ్ల హవా! (World Snooker ChampionShip| Hyderabad| Alok kumar| Geet Sethi| Sports| News)
రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో జరుగుతున్న ఐబిఎస్ఎఫ్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్లో భారత్కు చెందిన అలోక్ కుమార్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నాడు. దీంతో పురుషుల విభాగం నాకౌట్ దశకు అలోక్ కుమార్ చేరుకున్నాడు.
బుధవారం జరిగిన గ్రూప్ గేమ్లో అలోక్ 4-0 తేడాతో రయాన్ సోమరత్న (శ్రీలంక)ను ఓడించడం ద్వారా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అలోక్ కుమార్ ఒక్క గేమ్ను కూడా చేజార్చుకోకపోవడం విశేషం.
ఇదిలా ఉంటే.. ఏస్ క్రీడాకారులు గీత్సేథీ మాస్టర్స్ విభాగంలో 3-0 తేడాతో అబ్దుల్ (ఖతర్)ను ఓడించాడు. అలాగే కమల్ చావ్లా, బ్రిజేశ్ దమని సైతం తమ తమ గేమ్లలో గెలుపొందారు.
మహిళల విభాగంలో గ్రూప్-బిలో బిలో విద్యాపిళ్లై 3-0 తేడాతో భారత్కు చెందిన నీతా సాంఘ్విపై, 3-0తో నెల్హా సున్నీ (బహ్రెయిన్)పై విజయం సాధించారు.