వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఆసియా జోన్ ఉబెర్‌కప్: భారత్‌కు నాలుగో స్థానం (Asia Zone Uber Cup | Saina Nehwal | Japan | India | Aparna Balan)
Bookmark and Share Feedback Print
 
FILE
ఆసియా జోన్ ఉబెర్‌కప్ టోర్నమెంట్ భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమిని చవిచూడటంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆదివారం మూడో స్థానం జపాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో భారత్‌ 2-3 తేడాతో పరాజయం చవిచూసింది.

భారత నెంబర్‌వన్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ తొలి సింగిల్స్‌లో 21-17, 21-16 తేడాతో గోటోపై విజయం సాధించి 1-0 ఆధిక్యాన్ని అందించింది. తొలి డబుల్స్‌లో గుత్తా జ్వాలా-అశ్విని జోడీపై 16-21, 15-21 తేడాతో పుజీ-రికా జోడీ గెలవడంతో 1-1తో సమం అయింది.

మరోవైపు రెండో సింగిల్స్‌లో హిరోషి ఇరికో 22-20, 21-13 తేడాతో సయాలీ ఘోషల్‌పై విజయం సాధించింది. దీంతో 2-1 పాయింట్ల తేడాతో జపాన్‌ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఇక కీలకమైన మూడో సింగిల్స్‌లో తృప్తి 21-8, 21-16తో హిరాయామపై సునాయసంగా విజయం సాధించి స్కోరును 2-2తో సమం చేసింది.

కానీ చివరి డబుల్స్‌ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్‌-అపర్ణ బాలన్‌పై 16-21, 10-21 తేడాతో మియుకీ-సటాకోలు గెలిచి జపాన్‌కు 3-2 ఆధిక్యంతో పాటు మూడోస్థానాన్ని దక్కించారు. సైనా నెహ్వాల్‌ జంటపై జపాన్ ద్వయం మ్యాచ్ మొదటి నుంచే ఆధిక్యాన్ని సంపాదించుకుంది. దీంతో భారత్‌ను ఒక స్థానం వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.