కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైనప్పటి కొన్ని క్రీడాపోటీల్లో భారత్ ఖాతా తెరవలేదు. 1930 సంవత్సరంలో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్లో నాటి నుంచి నేటి వరకు స్విమ్మింగ్, డైవింగ్, ఆర్చరీ, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, లాన్ బౌల్స్, నెట్బాల్, రగ్బీ సెవెన్స్, స్క్వాష్లో ఇప్పటివరకూ ఒక్క పతకం కూడా సాధించలేకపోయింది.
ఈ పోటీల్లో ఉన్న 17 క్రీడాంశాల్లో తోటి దేశాలు పతకాల పంట పండిస్తుంటే భారత్ ఎనిమిదింటిలో ఇంకా ఖాతానే తెరవకపోవడం గమనార్హం. గత రికార్డులను తిరగేస్తే ఎనిమిది ఈవెంట్లలో భారత్ ఇప్పటి వరకు ఒక్క పతకం కూడా సాధించలేకపోయింది.
ఈ నేపథ్యంలో.. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ అక్టోబర్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అవినీతితోపాటు ఇతర అంశాలు పతాక శీర్షికలవడంతో ఈ కామన్వెల్త్ గేమ్స్లో మన దేశ క్రీడాకారుల ప్రతిభా పాటవాలెంతో వేచి చూడాల్సిందే..!