చైనా తొలిసారి ఆతిథ్యమిస్తున్న బీజింగ్ ఒలింపిక్స్లో భారత జట్టు ఒక పతకం గెలిచే అవకాశం ఉందని బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పడుకునే ఆశాభావం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు అనూప్ శ్రీధర్, సైనా నెహ్వాల్లు మెరుగ్గా రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు.
ముంబయిలో టాటా ఓపెన్ ఆలిండియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను పడుకునే ప్రారంభించారు. భారత జట్టు పతకం గెలవటం కష్టమే అయినా మెరుగ్గా రాణిస్తే మనకు అనకూలంగా మారుతుందన్నారు. ప్రత్యర్ధులతో భారత క్రీడాకారులు మెరుగ్గా ఆడటమే కాకుండా ప్రతి సెట్ విజయం చాలా ముఖ్యమని తెలిపారు.
బీజింగ్ ఒలింపిక్స్ క్రీడల్లో ప్రకాష్ పడుకునే సభ్యుడు. అయితే అతను గాయంతో బాధపడుతున్నాడు. తన గాయాలు వచ్చే ఐదు రోజుల్లో నయం అవుతుందని పడుకునే ఆశాభావం వ్యక్తం చేశాడు. విశ్వ క్రీడల సమయం నాటికి తన ఆరోగ్యం మెరుగుపడుతుందని పడుకునే వెల్లడించాడు.
|