బీజింగ్ ఒలింపిక్లో భాగంగా జరుగుతోన్న బ్యాడ్మింటన్ పోటీలనుంచి భారత క్రీడాకారుడు అనూప్ శ్రీధర్ నిష్క్రమించాడు. తొలి రౌండ్లో ఘన విజయం సాధించిన శ్రీధర్ రెండో రౌండ్లో ఓటమి చవిచూడడం అభిమానులకు నిరాశ కల్గించింది.
ప్రపంచ ర్యాకింగ్స్లో 12వ స్థానంలో ఉన్న జపాన్ క్రీడాకారుడు షోజిసాటోతో సోమవారం జరిగిన మ్యాచ్లో శ్రీధర్ ఓటమి పాలయ్యాడు. అనేక అంచనాలతో ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న శ్రీధర్ ఆదివారం జరిగిన తొలిరౌండ్లో విజయం సాధించి అభిమానుల్లో ఆశలు రేకెత్తించాడు.
పోర్చుగల్ క్రీడాకారుడు మార్కోవాస్కాన్సెలోన్తో జరిగిన తొలిరౌండ్ పోరులో 21-16, 21-14 తేడాతో విజయం సాధించడం ద్వారా శ్రీధర్ రెండో రౌండ్లో అడుగుపెట్టాడు.
|