బీజింగ్ ఒలింపిక్స్ షూటింగ్లో గురువారం భారత్కు చుక్కెదురైంది. షూటింగ్ విభాగంలోని 50 మీటర్ల రైఫిల్-3 పోటీల్లో పాల్గొన్న భారత మహిళా షూటర్లు ఫైనల్కు చేరుకోలేకపోయారు.
భారత్ తరపున బరిలో నిలిచిన అంజలీ భగవత్, అవనీత్ కౌర్లు ప్రారంభ రౌండ్లోనే వెనుతిరిగారు. మొత్తం 43 మంది షూటర్లు పాల్గొన్న ఈ ఫైనల్ క్వాలిఫైయింగ్ రౌండ్లో అంజలీ 571 పాయింట్లతో 32వ స్థానంలో నిలబడగా 552 పాయింట్లతో కౌర్ 42వ స్థానంలో నిలిచింది. దీంతో ఇద్దరు కూడా ఫైనల్కు అర్హత సాధించలేక పోయారు.
|