ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్ టేబుల్ టెన్నిస్ : తొలిరౌండ్‌లో నేహా నిష్క్రమణ
బీజింగ్ ఒలింపిక్స్‌లో భాగంగా సోమవారం జరిగిన మహిళల టేబుల్ టెన్నిస్ పోటీల్లో భారత క్రీడాకారిణి నేహా అగర్వాల్ తొలిరౌండ్‌లోనే వెనుతిరిగింది. ప్రత్యర్థిని నిలువరించడంలో కాస్త పోరాటపటిమ ప్రదర్శించినా చివరకు నేహా వెనుతిరగడం గమనార్హం.

ఆట ప్రారంభమైన కేవలం 34 నిమిషాల్లోనే నేహా పరాజయం పూర్తయ్యింది. మహిళల సింగిల్స్ ప్రిలిమనరీ రౌండ్‌ పోటీల్లో భాగంగా నేహా ఆస్ట్రేలియాకు చెందిన జియాన్ ఫాంగ్‌తో పోటీ పడింది.

కాసింత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో నేహా ప్రత్యర్థి చేతిలో 12-10, 8-11, 11-13, 8-11, 4-11 తేడాతో పరాజయం చవిచూసింది. తద్వారా ఈ విభాగంలో భారత పోరు ముగిసినట్టైంది.
మరిన్ని
బీజింగ్ ఒలింపిక్స్ : భారత్‌కు షరా మామూలే
ప్రపంచ రికార్డును తిరగరాసిన ఫెల్ప్స్
ఒలింపిక్స్ బాక్సింగ్ : క్వార్టర్స్‌లో విజేందర్
బీజింగ్ ఒలింపిక్ : పతకాల పట్టికలో టాప్ టెన్
సొంత గూటికి చేరిన 'స్వర్ణ' వీరుడు బింద్రా
బాక్సింగ్ వీరులకు హర్యానా ప్రభుత్వ నజరానా