బీజింగ్ ఒలింపిక్స్లో భాగంగా సోమవారం జరిగిన ట్రిపుల్ జంప్ క్వాలిఫైయింగ్ రౌండ్లో భారతకు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో మొత్తం 37మంది పాల్గొనగా భారత్కు చెందిన రంజిత్ మహేశ్వరి 35వ స్థానంలో నిలవడం ద్వారా ఫైనల్కు అర్హత కోల్పోయాడు.
భారత్ తరపున జాతీయ స్థాయిలో 17.04 మీటర్ల దూరం దూకడం ద్వారా రికార్డు సృష్టించిన రంజిత్ ఒలింపిక్స్లో మాత్రం తన ప్రదర్శనను పునరావృతం చేయలేక పోయాడు. బీజింగ్ ఒలింపిక్స్లో రంజిత్ కేవలం 15.77 మీటర్ల దూరం మాత్రమే దూకి నిరాశ పరిచాడు.
|