బీజింగ్ ఒలింపిక్స్లో సోమవారం భారత్కు తీపి కబురు అందింది. పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నీస్ (టీటీ)లో భారత క్రీడాకారుడు తెలుగు తేజం శరత్ కమల్ రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు.
ఉత్కంఠభరితంగా సాగిన పోరులో శరత్ ప్రత్యర్థిపై 6-11, 12-10, 11-8, 9-11, 11-6, 11-7 తేడాతో శరత్ విజయం సాధించాడు. ఈ విజయంతో శరత్ టేబుల్ టెన్నీస్ సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్లోకి అడుగుపెట్టినట్టైంది. రెండో రౌండ్లో శరత్ ఆస్ట్రేలియా క్రీడాకారుడు చెన్తో తలపడనున్నాడు.
|