బీజింగ్ ఒలింపిక్స్లో భారత ముచ్చట ఒక్కొక్కటిగా నీరుగారి పోతోంది. ప్రారంభంలో దూకుడు ప్రదర్శిస్తున్న భారత క్రీడాకారులు పతకం సాధించే దిశగా మాత్రం పురోగతి సాధించలేక పోతున్నారు. తాజాగా ఆ జాబితాలో టెబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆచంట శరత్ కూడా చేరాడు.
బీజింగ్లో బుధవారం జరిగిన టెబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో శరత్ రెండో రౌండ్లో ఓటమి చెందడం ద్వారా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దీంతో ఈ విభాగంలో భారత పోరు పూర్తయ్యింది. ఆస్ట్రియాకు చెందిన చెన్ వీ జింగ్తో జరిగిన రెండో రౌండ్ పోరులో శరత్ ఓటమి చవిచూశాడు.
దాదాపు 32 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో శరత్ 5-11, 12-14, 2-11, 11-8, 10-12 స్కోరు తేడాతో ఓడిపోయాడు. బీజింగ్లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో అద్భుతమైన ఆటతీరుతో శరత్ రెండో రౌండ్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ తొలి రౌండ్ మ్యాచ్లో స్పెయిన్ ఆటగాడు కామెరోన్ను ఓడించడం ద్వారా శరత్ అందరి దృష్టినీ ఆకర్షించాడు.
|