బీజింగ్ ఒలింపిక్స్లో అనేక అంచనాల మధ్య క్వార్టర్స్లోకి అడుగుపెట్టిన బాక్సర్ జితేందర్ కుమార్ ఓటమి చవిచూశాడు. బీజింగ్లో బుధవారం సాయంత్రం 51 కేజీల విభాగంలో జరిగిన పోరులో రష్యా బాక్సర్ బాలక్సిన్ చేతిలో జితేందర్ ఖంగు తిన్నాడు. దీంతో బాక్సింగ్ విభాగంలో మరో పతకం వస్తుందనుకున్న భారత అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి.
హోరాహోరీగా సాగిన పోరులో చివరకు 15-11 తేడాతో విజయం రష్యా బాక్సర్ను వరించింది. క్వార్టర్స్లో జితేందర్ వెనుదిరగడంతో ఇక భారత్ ఆశలన్నీ మరో క్వార్టర్స్ పోరులో తలపడనున్న విజేందర్ మీదే ఉన్నాయి.
|