ఒలింపిక్లో పాల్గొన్న తొలి వికలాంగురాలిగా స్విమ్మర్ నథాలీ డ్యుటొయిట్ చరిత్ర సృష్టించింది. బీజింగ్లో బుధవారం జరిగిన 10 కి.మీ. మారథాన్ స్విమ్మింగ్లో 16వ స్థానంలో నిలవడం ద్వారా తనలో సత్తాకు ఏమాత్రం కొదవలేదని ఆమె నిరూపించింది.
వికలాంగురాలైనా ఒలింపిక్స్లో పాల్గొనాలనే తన కోరిక ఈ విధంగా నెరవేరినందుకు సంతోషంగా ఉందని పోటీల అనంతరం నథాలీ పేర్కొంది. తాను వికలాంగురాలైనా ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నదే తన కోరిక అని ఆమె వ్యాఖ్యానించింది.
అయితే బీజింగ్ ఒలింపిక్స్లో 16వ స్థానంలో నిలిచినా గతంలో 2004లో జరిగిన పారా ఒలింపిక్స్లో నథాలీ ఆరు స్వర్ణ పతకాలు గెల్చుకోవడం గమనార్హం.
|