Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్
టిడిపి ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆంధ్రప్రదేశ్లో మొథా తుఫాను వల్ల జరిగిన నష్టంపై వివరణాత్మక నివేదికను సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,109 గ్రామాలపై తుఫాను ప్రభావం చూపిందని, వివిధ రంగాలలో రూ.6,356 కోట్ల నష్టం వాటిల్లిందని లోకేష్ పేర్కొన్నారు.
మొంథా తుఫాను ప్రభావం వలన జరిగిన నష్టం అంచనా సమగ్ర నివేదికను కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్కు అందించారు. ఇటీవల మొంథా తుపానుతో పంట నష్టం ఎక్కువగా జరిగింది. వరద నష్టం అంచనాల కోసం కేంద్ర కమిటీ వచ్చి పరిశీలన చేసి వెళ్లింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత సమక్షంలో ఈ నివేదికను సమర్పించినట్లు నారా లోకేష్ తెలిపారు.
జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డిఆర్ఎఫ్) మార్గదర్శకాల ప్రకారం తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ సహాయంగా రాష్ట్రం రూ.902 కోట్లు కోరుతున్నట్లు లోకేష్ తెలిపారు. సమావేశంలో పలువురు పార్లమెంటు సభ్యులు కూడా పాల్గొన్నారు.