సహజంగానే స్వాతంత్ర్యకాముకులైన తెలుగు ప్రజానీకం.. భారత స్వాతంత్ర్య సమరంలో ముందుకు ఉరకడం కూడా అత్యంత సహజం. అందుకే 1919వ సంవత్సరంలో కాంగ్రెస్ నాయకత్వం వహించిన తరువాత తెలుగునాట స్పందన మరింత ఎక్కువయ్యింది. ఈ స్పందనకు 1913 నుంచి జాతీయ భావాలు గల పత్రికలెన్నో ఉద్యమానికి అపారంగా దోహదం చేశాయి.