విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ను ఆంధ్రా భగత్ సింగ్ అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. గురువారం లోకసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)ను ప్రవేశ పెట్టిన సమయంలో లగడపాటి పెప్పర్ స్ప్రే చేసిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర దుమారం రేపింది.లగడపాటి స్ప్రేను తెలంగాణ నేతలతో పాటు పలువురు ఖండిస్తుండగా, సీమాంధ్ర నేతలు దానిని చిన్న విషయంగా చెబుతున్నారు. లగడపాటి పెప్పర్ స్ప్రే నేపథ్యంలో ఆయనను ఆంధ్రా భగత్ సింగ్ అంటూ కొనియాడుతూ ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి.