ప్రత్యేక తెలంగాణపై నివేదిక సమర్పించిన శ్రీ కృష్ణ కమిటీ ఓ దౌర్భాగ్య కమిటీ అని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణకు సంబంధించి ఎంపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని పొన్నం శనివారం వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆకాంక్షలను గౌరవించాలని కోర్ కమిటీకి వివరించామని పొన్నం చెప్పారు.