ఏపీ మంత్రుల సగటు ఆస్తి రూ.45.49 కోట్లు.. కుబేర మంత్రుల్లో నారాయణ టాప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సగటు ఆస్తి రూ.45.49 కోట్లుగా ఉంది. వీరిలో అపర కుబేరుడుగా రాష్ట్ర మున్సిపాలిటీ మంత్రి పి నారాయణ అగ్రస్థానంలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సగటు ఆస్తి రూ.45.49 కోట్లుగా ఉంది. వీరిలో అపర కుబేరుడుగా రాష్ట్ర మున్సిపాలిటీ మంత్రి పి నారాయణ అగ్రస్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 620 మంది మంత్రులు ఉండగా, 609 మంది మంత్రులపై కేసులు, వారి ఆస్తులపై అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అధ్యయనం చేసింది.
ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ మంత్రి నారాయణ కోటీశ్వరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రాల మంత్రుల్లో కోటీశ్వరుల్లో టీడీపీకి చెందిన మంత్రి పొంగూరు నారాయణ రూ.496 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక మంత్రి శివకుమార్(రూ.251 కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు.
దేశవ్యాప్తంగా మంత్రుల ఆస్తుల సగటు రూ.8.59 కోట్లు కాగా, ఏపీ మంత్రుల ఆస్తి సగటు రూ.45.49 కోట్లు. తర్వాతి స్థానంలో కర్ణాటక, అరుణాచల్ ఉన్నాయి. ఆస్తుల అత్యల్ప సగటున్న రాష్ట్రంగా త్రిపుర (రూ.31.67 లక్షలు)గా నిలిచింది.