ఇదండీ! మీ అమరావతి... నమూనాలు అందించిన ఆర్కిటెక్ట్స్...
ఇదీ మీ సెక్రటేరియేట్... ఇది హైకోర్టు... ఇది అసెంబ్లీ... ఇదీ సిఎం క్యాంప్ అంటూ... ఆర్కిటెక్ట్స్ అమరావతి నమూనాలను ఏపీ సిఎం చంద్రబాబుకు అందజేశారు. అమరావతి అపురూప కట్టడాలపై సింగపూర్, జపాన్లకు చెందిన ఆర్కిటెక్ట్స్ సీఎం ఎదుట ప్రెజెంటేషన్ ఇచ్చారు.
33 వేల ఎకరాలు రైతుల నుంచి, మరో 50 వేల ఎకరాలు ప్రభుత్వ పరంగా సేకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... సువిశాల అమరావతి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. దీనికి సంబంధించిన నమూనాలను ఆర్కిటెక్ట్స్ చూపించి... సీఎంకు వాటి ప్రత్యేకతలను వివరించారు. ఇందులో కేంద్ర మంత్రి సుజనా చౌదరితోపాటు కృష్ణా గుంటూరు జిల్లాల కలెక్టర్లు... ఇతర అధికార అనధికారులు పాల్గొన్నారు.