గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 18 డిశెంబరు 2015 (16:15 IST)

మొన్న కూడా వేలు చూపించారు... 2 నిమిషాలిస్తే అంతు చూస్తా... ఏపీ అసెంబ్లీలో రాజు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాల్ మనీపై ప్రకటన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగానికి వైకాపా సభ్యులు అడ్డు తగిలారు. స్పీకర్ ఎంతగా వారించానా వారు వినలేదు. ఎమ్మెల్యే రోజా ఏకంగా సీఎం సీటు వద్దకు దూసుకువచ్చి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పక్కకు వెళ్లారు. ఈ తంతునంతా గమనిస్తున్న భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆగ్రహంతో ఊగిపోయారు. 
 
స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశిస్తూ.... మీరేమనుకుంటున్నారు? నాకు రెండు నిమిషాల సమయం ఇస్తే ఎవరు ఏంటో తేల్చేస్తానన్నారు. ఓ శాసనభ్యుడు వేలు చూపించడంపై మండిపడుతూ... మొన్న కూడా ఇలాగే వేలు చూపించారు. అలా వేళ్లు చూపిస్తే భయపడిపోతామని అనుకోవద్దు అని మండిపడ్డారు. శాసనసభలో రౌడీయిజం మంచిది కాదని హితవు పలికిన ఆయన జగన్ మోహన్ రెడ్డి తన సభ్యులను అదుపులో పెట్టాలని కోరారు.