ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 9 మార్చి 2026 (18:24 IST)

5 వేలమంది యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించడానికి ఏపితో బివైఎస్‌టి భాగస్వామ్యం

ncbn
అమరావతి: యువతలో వ్యవస్థాపక సామర్థ్యాన్ని వెలికి తీయడానికి, పర్యావరణ అనుకూల జీవనోపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా, భారతీయ యువ శక్తి ట్రస్ట్(బివైఎస్టి) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సూక్ష్మ మరియు నానో వ్యాపార సంస్థలను విస్తరింప చేయటానికి, వాటిని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా వాటికి అవసరమైన కౌన్సెలింగ్, శిక్షణ, మార్గదర్శకత్వం, ఆర్థిక లభ్యత, చేయూత అందించటం ద్వారా బివైఎస్టి మద్దతును అందిస్తుంది.
 
2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు; గౌరవనీయ ఎంఎస్ఎంఈ, సెర్ప్  మరియు ఎన్ఆర్ఐ సాధికారతలు మరియు సంబంధాల మంత్రి శ్రీ. కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై బివైఎస్టి సంతకం చేసింది, ఇది ఒక కుటుంబం, ఒక వ్యవస్థాపకుడు(OFOE) అనే లక్ష్యానికి మద్దతు ఇస్తుంది. ప్రతి ఇంటిలోనూ వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, బలమైన స్థానిక పర్యావరణ వ్యవస్థలను నిర్మించడం దీని లక్ష్యం.
 
ఈ కార్యక్రమం విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో తొలుత అందుబాటులోకి తీసుకురానున్నారు. ఔత్సాహిక వ్యవస్థాపకుల ఆలోచనలను ఆచరణీయ వ్యాపారాలుగా మార్చడానికి అవకాశాలను అందించనున్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో, ఏపి ఎంఎస్ఎంఈ, సిస్కో ఇండియా సీఎస్ఆర్ ప్రయత్నాలు, ఇతరుల మద్దతుతో బివైఎస్టి 15,000 మంది మార్గదర్శకుల నెట్‌వర్క్‌ను నిర్మించడం ద్వారా, 2,000 మందికి పైగా యువ వ్యవస్థాపకులకు ఆర్థిక అవకాశాలను  సులభతరం చేయడం ద్వారా రాష్ట్ర వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) జూలై-సెప్టెంబర్ 2025 డేటా ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగిత రేటు 8.2% వద్ద ఉంది, ఇది జాతీయ సగటు 5.2% కంటే చాలా ఎక్కువ. ఇది వ్యవస్థాపకత, స్వయం ఉపాధి కోసం మార్గాలను విస్తరించాల్సిన తక్షణ అవసరాన్ని వెల్లడిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం ముఖ్యంగా ఎక్కువగా ఉందని, మహిళలు ఉపాధి పరంగా అధిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారని కూడా డేటా సూచిస్తుంది.
 
బివైఎస్టి వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి లక్ష్మీ వి. వెంకటేశన్ మాట్లాడుతూ భారతదేశపు యువత ఆలోచనలు, ఆశయాలతో నిండి ఉంది, కానీ వారి ప్రయాణం చాలాసార్లు ప్రారంభం కాకముందే ఆగిపోతుంది. ఎందుకంటే వారికి సరైన మార్గదర్శకత్వం, నైపుణ్య శిక్షణ లేదా ఆర్థిక లభ్యత లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమం ప్రారంభించటం ద్వారా, యువ వ్యవస్థాపకులను మార్గదర్శకత్వం, అభ్యాస అవకాశాలు, ఆర్థిక మార్గాలతో అనుసంధానించి  దానిని మార్చడానికి బివైఎస్టి కృషి చేస్తోంది. తద్వారా ఆశాజనకమైన ఆలోచనలు జీవనోపాధిని సృష్టించే మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే స్థిరమైన సంస్థలుగా ఎదగగలవు అని అన్నారు. 
 
రాష్ట్రంలోని ఆరు కీలక జిల్లాల్లో 5,000 మంది యువత ఆధారిత వ్యాపార ఆలోచనలను గుర్తించి పెంపొందించడానికి ఈ భాగస్వామ్యం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార ఆలోచనల పోటీని ప్రారంభిస్తోంది. యువ వ్యాపారిత్వ రథం (యువ వ్యవస్థాపక వ్యాన్) ఈ ఆరు జిల్లాల్లో పర్యటిస్తుంది, పోటీ గురించి అవగాహన పెంచుతుంది. యువత తమ వ్యాపార ఆలోచనలను సమర్పించమని ప్రోత్సహిస్తుంది. ఎంపిక చేయబడిన అభ్యర్థులు వ్యవస్థాపక శిక్షణ, నిర్మాణాత్మక మార్గదర్శకత్వం, అధికారికంగా ఆర్థిక సహాయం పొందడంలో మద్దతు పొందుతారు. వారి ఆలోచనలను ఆచరణీయమైన మరియు స్థిరమైన సంస్థలుగా మార్చడంలో వారికి సహాయమూ లభిస్తుంది.
 
ఈ కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో, యువత ఉద్యోగార్ధుల నుండి ఉద్యోగ సృష్టికర్తలుగా మారడానికి వీలు కల్పించడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది.