1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Chandrababu Naidu Launches TDP Mahanadu 2026

మహానాడు విధానం, స్ఫూర్తి మారలేదు.. కార్యకర్తలే బలం, బలగం.. చంద్రబాబు

Chandrababu Naidu
Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 
 
ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికలను యుద్ధంగా అభివర్ణించారు. సమావేశం మోడల్ మారిందే తప్ప.. మహానాడు విధానం, స్ఫూర్తి మారలేదు" అని ఆయన స్పష్టం చేశారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారిది విధ్వంసకర పాలన అయితే, తమది అభివృద్ధి మంత్రమని స్పష్టం చేశారు. పేదలకు కావాల్సింది సంక్షేమమే తప్ప గొడ్డలివేట్లు కాదని, యువతకు ఉద్యోగాలు కావాలి కానీ గొడ్డలిపోట్లు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కి వెళ్లిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. దేశంలో ఏ పార్టీకి లేని బలమైన కేడర్ టీడీపీకి ఉందని, పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని చంద్రబాబు కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏ ఎన్నికైనా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, నేతలు ఇగోలకు పోకుండా మిత్రపక్షాలతో సమన్వయంతో ముందుకు సాగాలని హితవు పలికారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
దేశంలో భానుడి భగభగలు... పౌరులకు ప్రధాని మోడీ సూచనలు