శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 25 డిశెంబరు 2014 (14:00 IST)

ఘనంగా క్రిస్మస్ వేడుకలు...! కేక్ కట్ చేసిన కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్మస్ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన అబిడ్స్ చాపెల్ రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనతోపాటు పలువురు మంత్రులు ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు. 
 
క్రిస్మస్‌ను పురస్కరించుకుని కేసీఆర్...కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరులకు క్రైస్తవ భవన్ నిర్మిస్తున్నామని, జీసస్ దయతో క్రిస్మస్కు ఒకరోజు ముందే భవనానికి శంకుస్థాపన జరిగిందన్నారు.
 
అందుకోసం రూ.10కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీతో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, కత్తి పద్మారావు, కె. కేశవరావు, ఎంపీ కవితతో పాటు పలువురు హాజరయ్యారు.