1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. DCM Pawan Kalyan allocates Rs 200 crore for road works in Pithapuram

ఇచ్చిన మాటకు కట్టుబడిన పవన్ కల్యాణ్.. కళకళలాడుతున్న రోడ్లు

pawan kalyan
ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తన నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, పల్లె నుంచి పట్టణం వరకు రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 
 
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే రూ.100 కోట్ల వ్యయంతో 152 కిలోమీటర్ల మేర 611 రోడ్ల నిర్మాణం పూర్తి కాగా, మరో 70 రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో దాదాపు 80 శాతం కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయినట్లయింది. 
 
ఈ పనులతో గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజల ప్రయాణ కష్టాలు తొలగిపోయి రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి. ఉప్పాడ తీరంలో అలల కోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాయాపట్నం మత్స్యకారుల కోసం సుబ్బంపేట సమీపంలో ఏర్పాటు చేసిన కొత్త మాయాపట్నం పునరావాస కాలనీలో మౌలిక వసతుల కల్పనపై పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ చూపారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
2028 నాటికి అమరావతి నిర్మాణంలో మొదటి దశ పూర్తి.. వంగలపూడి అనిత