ఘనంగా క్రిస్మస్ వేడుకలు...! కేక్ కట్ చేసిన సీఎంలు...!
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణలలో ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్లో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అబిడ్స్ అబిడ్స్ చాపెల్ రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి పండుగ జరుపుకున్నారు. ఇదేవిధంగా ఇరు రాష్ట్రాల ప్రజలు క్రైస్తవ ఆలయాలలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుని క్రీస్మస్ వేడుకలను కోలాహలంగా చేసుకున్నారు.