నయీం చుట్టూ మెరుపుతీగల్లాంటి గర్ల్స్... ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.లక్ష విరాళం
ఖమ్మం జిల్లాలో గ్యాంగ్స్టర్ నయీం జల్సాలు సాగించినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఇందుకోసం ఈ జిల్లాలో ఓ విశ్రాంతి గృహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నయీం ఇక్కడకు వచ్చినపుడల్లా ఆయన వెంట 18 నుంచి 25 యేళ్
ఖమ్మం జిల్లాలో గ్యాంగ్స్టర్ నయీం జల్సాలు సాగించినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఇందుకోసం ఈ జిల్లాలో ఓ విశ్రాంతి గృహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నయీం ఇక్కడకు వచ్చినపుడల్లా ఆయన వెంట 18 నుంచి 25 యేళ్ల మెరుపుతీగల్లాంటి అమ్మాయిలను తన వెంట తీసుకొచ్చేవాడు. ఆ అమ్మాయిలతో నయీం జల్సాలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలోని చింతకాని మండల పరిధిలోని గాంధీనగర్లో ఈ అతిథి గృహం ఉంది. తన తల్లి తాహేరా బేగం పేరిట 2011లో దానిని రూ.3 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇందులో రెండు ఏసీలు, సోఫాలు, బెడ్లు, సీసీ కెమెరాలు పెట్టించాడు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నయీం చుట్టూ 18 నుంచి 25 ఏళ్లలోపు మెరుపు తీగల్లాంటి అమ్మాయిలు ఉండేవారని, స్థానికులు తెలిపారు.
వాళ్లు బురఖాల్లో ఉండేవారని, ఇంట్లోకి వెళ్లగానే లెగ్గింగ్స్, టాప్స్, షార్ట్ జీన్స్ వేసుకొనే వారని ఆ ఇంట్లో ఎలక్ట్రీషియన్గా పనిచేసిన వ్యక్తి తెలిపారు. ఎలక్ట్రికల్ పనులు జరుగుతుంటే, మహిళలను మరో రూంలోకి పంపేవాడని తెలిపాడు. ఇక, గాంధీనగర్లోని ఆంజనేయస్వామి గుడి నిర్మాణానికి నయీం తన తండ్రి నసీరుద్దీన్, తల్లి తాహేరా బేగం పేరుతో రూ.1,10,116 విరాళంగా ఇచ్చినట్టు స్థానికులు వెల్లడించారు.