సంబంధిత వార్తలు
- Ntr: అఖిల్ అక్కినేని రీఎంట్రీకి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్
- సీఎం విజయ్ కీలక నిర్ణయం : తమిళనాడులో పరుగులు పెట్టనున్న ఏసీ బస్సులు
- ట్రెండింగ్లో పిల్లలను ఆకట్టుకునే గ్రామీణ నేపథ్యంలో సాగే వీడియో గేమ్
- గ్రామాల్లో ప్రజలకు నచ్చిన ఆలయాలను నిర్మిస్తాం : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
- యజమానిని చంపేసిన కూలీలు.. బండరాయితో మోది అదే రాయిని నడుముకు కట్టి...
జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు... కియా కారుకు లింకుందా?
కాకినాడ జూన్ 6న సి. అగ్రహారం గ్రామంలోని పామాయిల్ తోట నుండి రెండేళ్ల చిన్నారి అదృశ్యమైన రోజున, ఆ గ్రామంలో ఒక కియా కారు తిరుగుతూ ఉందన్న వార్తలను తుని రూరల్ పోలీసులు ఖండించారు. ఆ కారు రెండు రోజుల పాటు గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ, ఒక వృద్ధుడిని కూడా ఢీకొట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్లు వచ్చాయి. అంతేకాకుండా, నర్సీపట్నం సమీపంలో ఆ చిన్నారి బంధువైన కోటేశ్వరరావును కూడా ఆ కారు ఢీకొట్టిందని ఆ పోస్ట్లలో పేర్కొన్నారు. ఇది తప్పుడు వార్త అని సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్న కేశవరావు తెలిపారు.
ఆ రోజు ఆ ప్రాంతంలో కనిపించిన 18 వాహనాలను పోలీసు బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి, వాటి యజమానుల నుంచి వివరాలు సేకరించాయి. ఆ చిన్నారి బంధువు కోటేశ్వరరావు చెప్పిన కారు నంబర్ను పరిశీలించగా, అది "విజయవాడలోని ఒక లారీకి చెందినది"గా తేలింది. ఆ లారీ ఆ రోజు తుని వైపు వెళ్లలేదని దాని యజమానులు తెలిపారని సీఐ పేర్కొన్నారు. కోటేశ్వరరావును పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
