గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 8 ఆగస్టు 2015 (11:59 IST)

తెలుగు రాష్ట్రాల్లో నో ప్రాబ్లమ్స్: అంతా మీడియా సృష్టే.. గవర్నర్

ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్‌తో గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. అయితే మీడియానే ఆ రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు. కాగా త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. మరికాసేపట్లో గవర్నర్ హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో సమావేశమై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితులపై వివరించనున్నారు.
 
ఇదిలా ఉంటే.. వచ్చే అసెంబ్లీ సమావేశాలను సాగర తీరం విశాఖపట్నంలో నిర్వహించాలని భావిస్తున్నట్టు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పరిశీలన జరుపుతున్నామని చెప్పారు. ఇదే జరిగితే, హైదరాబాద్ వెలుపల తొలిసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్టు అవుతుంది. 
 
దీనికి తోడు, ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని... రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని యనమల అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.