శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (06:37 IST)

కాపుకాసి ప్రేమ జంటల వేట... 4 నెలల్లో 20 మందిపై అత్యాచారం.. ఎక్కడ?

గుంటూరు జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైనశైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రేమ కబుర్లు చెప్పుకునేందుకు ఏకాంత ప్రదేశానికి వచ్చే ఒంటరి ప్రేమ జంటలను కాపుకాసి... కిడ్నాప్ చేసి.. కర్కశంగా కత్తులతో బెదిరించి, యువతిని వివస్త్రగా మార్చి... అత్యాచారం చేస్తారు. అంతేనా, వారివద్ద ఉన్నదంతా దోచుకుని.. బయటకు చెపితే చంపేస్తామని బెదిరిస్తున్నట్టు ఈ నలుగురు సభ్యులు వెల్లడించారు. ఈ విధంగా గత 4 నాలుగు నెలల్లో 20 మంది జంటలపై అత్యాచారం చేసినట్టు చెప్పారు. 
 
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక ఇంట్లో చోరీ చేసి, యువతిపై అత్యాచారానికి ప్రయత్నించగా, ఆమె ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో భాగంగా.. వినోద్‌కుమార్‌, నాగరాజు దుర్గాప్రసాద్‌ మనోజ్‌ అనే నలుగురిని పోలీసులు విచారణ చేశారు. వారు చెప్పిన విషయాలతో పోలీసులనే నిశ్చేష్టులే చేష్టలుడికి పోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విజయవాడ పరిధిలో నున్న-పాయకాపురం ఏరియాలో వందల ఎకరాల్లో అనేక వెంచర్లు వేశారు. ఇక్కడ ఖాళీ ప్లాట్లు అనేకం ఉన్నాయి కూడా. ప్రేమ జంటలు, వివాహేతర సంబంధం పెట్టుకున్న జంటలు తరచూ విజయవాడ నుంచి ఇక్కడకు వచ్చి.. తమతమ పనులు పూర్తి చేసుకుని వెళుతుంటారు. వీరిని తాడేపల్లికి చెందిన దేవర వినోద్‌కుమార్‌, మేడా నాగరాజు, ఎర్రబడి దుర్గా ప్రసాద్‌, కొండ్రెడ్డి మనోజ్‌లు లక్ష్యంగా చేసుకున్నారు. ఒంటరిగా, ఏకాంతంగా ఉండే జంటలను కత్తులతో బెదిరించి.. లొంగదీసుకొంటారు. వారిని దూరంగా తీసుకెళ్లి.. తీవ్ర వేధింపులకు గురిచేస్తారు. 
 
వారి వద్ద ఉన్న వస్తువులను దోపిడీ చేస్తారు. తిరగబడితే కత్తులతో దాడి చేస్తారు. ఆ తర్వాత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతారు. ఇలా 2014 డిసెంబర్‌ నుంచి గత మార్చి వరకు సుమారు 20 మందిపై అత్యాచారం జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. కానీ, తమ పరువు సమస్యతో బాధితులు బయటకు రాలేదు. కానీ, ఓ విద్యార్థిని మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి బండారం బయటపడింది. ఈ ముఠా నాయకుడు, ఇతర కీలక సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.