బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. »
  3. తెలుగు వార్తలు
  4. »
  5. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 6 జూన్ 2014 (12:31 IST)

స్వర్ణ దేవాలయంలో కత్తుల యుద్ధం.. 12 మందికి గాయాలు!

పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయంలో శిరోమణి అకాలీదళ్ కార్యకర్తలకు, ఆలయ భద్రతా సిబ్బందికి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఫలితంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఈ ఘర్షణల్లో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
ఈ వివాదాన్ని సద్దుమణించేందుకు సిక్కు మతపెద్దలు ప్రయత్నించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 'ఆపరేషన్ బ్లూ స్టార్' ఘటన జరిగి ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ టాస్క్ ఫోర్స్, శిరోమణి అకాళీదళ్ కార్యకర్తలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.