శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2016 (11:38 IST)

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడనీ విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్మీడియ్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా రాయచోటిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కడప జిల్లా రాయచోటికి చెందిన శ్రీనివాసులు కుమారుడు లోకేష్‌ చిత్తూరు జిల్లా సి.రామాపురం పంచాయతీ కోదండరామాపురంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశాడు. ఈనెల 19వ తేదీన వెల్లడైన ఇంటర్మీడియల్‌ పరీక్షల్లో ఫెయిలైనట్లు ఫలితాలు రావడంతో లోకేష్‌ మనస్థాపానికి గురయ్యాడు. తన కుమారుడు ఫెయిలైనా తండ్రి శ్రీనివాసులు అదే కళాశాలలో ఎంసెట్‌కు శిక్షణలో చేర్పించాడు. 
 
అయితే ఇంటర్‌లో ఫెయిలయ్యానన్న మనస్థాపంలో సోమవారం తెల్లవారుజామున హాస్టల్‌‌లో ఎవరూ లేని సమయంలో లోకేష్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లోకేష్‌ మృతితో హాస్టల్‌‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. లోకేష్‌ను చూసిన తల్లిదండ్రులు కన్నీంటి పర్యాంతమయ్యారు.