డ్రగ్స్, యువతి కోసమే విజయవాడలో యువకుల థార్ జీపులతో ఢీకొట్టుకున్నారట
ప్రభుత్వం ఎంత కట్టడి చేస్తున్నా డ్రగ్స్ దందా నడుస్తూనే వుంది. ఇటీవలే విజయవాడలో థార్ జీపులతో ఇద్దరు యువకులు ఢీకొట్టుకుంటూ పరస్పరం దాడి చేస్కున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తులో పలు విషయాలు వెలికి వచ్చాయి. విజయవాడ 100 ఫీట్ రోడ్డులో థార్ జీపులతో హంగామా సృష్టించిన కేసులో నిందింతుల్లో ఒకరైన బొల్లా ఓంకార్ డ్రగ్స్ సేవించినట్లు వైద్య పరీక్షలో తేలింది.
ఇతడు మరో యువకుడితో థార్ జీపుతో చేసిన దాడి వెనుక కారణం యువతి కోసమేనని తేలింది. వీరు గొడవ పడిన సమయంలో ఒక జీపులో సదరు యువతి కూడా వున్నట్లు సీసీ ఫుటేజిలో రికార్డయ్యింది. కాగా ఆ యువతి ఎవరన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
థార్ కార్ల బీభత్సం.. డ్రగ్స్, అమ్మాయి కోసమేనని తేల్చిన పోలీసులు
— BIG TV Breaking News (@bigtvtelugu) May 23, 2026
విజయవాడ 100 అడుగుల రోడ్డులో థార్ జీపులతో హంగామా సృష్టించిన కేసులో నిందితుడు బొల్లా ఓంకార్ డ్రగ్స్ సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
ఒక యువతి కోసమే వీరిద్దరూ రోడ్డుపై కార్లతో ఈ బీభత్సానికి తెగబడినట్లు పోలీసుల… https://t.co/Wl2Xm7dZ24 pic.twitter.com/c28xDy3LmM
