మోహన్ బాబు - మంచు విష్ణులపై కేసు నమోదు
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు, సినీ హీరో మంచు విష్ణులపై పోలీసులు కేసు నమోదైంది. ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ కిడ్నాప్ వ్యవహారంలో వారిపై కేసు నమోదు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్లన గంటన్నరలో పట్టుకున్నారు.
తిరుపతి సమీపంలోని చంద్రగిరి పరిధిలో ఉన్న మోహన బూబు యూనివర్శిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలు జరుగుతున్నాయంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళుతున్న ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోదలను తిరుచానూరు సమీపంలో కిడ్నాప్ చేశారు. దాదాపు 30 మంది వ్యక్తులు వీరిని ఓ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కిడ్నాప్ విషయం తెలుసుకున్న సీపీఏం నేత కందారపు మురళి జిల్లా ఎస్పీకి సమాచారం అందించాు. ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగిన సీఐ సునీల్ కుమార్ నేతృత్వంలోని మూడు బృందాలు. కిడ్నాపర్లను వెంబడించారు. గంటన్నరలోనే వారిని పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వాహనాలను సీజ్ చేశారు. నిందితులను పీఎస్కు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు, యూనివర్శిటీ పీఆర్వో సతీశ్ను ఏ1గా మోహన్ బాబును ఏ2గా, మంచు విష్ణును ఏ3గా చేర్చారు.