కోనేటి గట్టుపై ప్రేమజంట ఆత్మహత్య.. విషం తాగి తిరిగిరాని లోకాలకు.. ఎక్కడ?
ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ ప్రేమ జంట కోనేటి గట్టుపై విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. కులాలు వేరుకావడంతో పెద్దలు వారి ప్రేమకు అడ్డుతగిలారు. దీంతో ఆ ప్రేమ జంట నార్కెట్పల్లి మండలం అక్కినపల్లి గ్రామంలోని రామాలయం పక్కనే ఉన్న కోనేరు వద్ద విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమికులను నల్లగొండ మండలం దోమలపల్లికి చెందిన రమేష్, ప్రసన్నలుగా గుర్తించారు.
రమేష్ ఆటో డ్రైవర్గా పనిచేస్తుండగా, ప్రసన్న ఇంటర్ ఫైనలియర్ చదువుతోంది. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. అందుకే ఈ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.