అరవ శ్రీధర్ నాకు అన్యాయం చేసాడు: తెదేపా ప్రజాదర్బారులో బాధితురాలు హర్షవీణ, వీడియో
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనకు అన్యాయం చేసారనీ, తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు హర్షవీణ అభ్యర్థించారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బారుకి వచ్చిన ఆమె ముక్కా రూపానందరెడ్డికి వినతి పత్రం అందించారు.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో ట్విస్ట్
— BIG TV Breaking News (@bigtvtelugu) April 2, 2026
రైల్వేకోడూరు టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమైన ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలు హర్షవీణ
ప్రజాదర్బార్లో ముక్కా రూపానందరెడ్డిని కలిసిన హర్షవీణ
అరవ శ్రీధర్ వ్యవహారంలో సహకరించాలని కోరిన హర్షవీణ
Harshaveena, the victim of MLA Arava Sridhar,… pic.twitter.com/ZYe9GMmvSF
అంతకుముందు కొన్నిరోజుల క్రితం బాధితురాలు వీణ మాట్లాడుతూ... నేను ఎక్కడో దాక్కున్నానని కొంతమంది రాస్తున్నారు. నేను ఎక్కడా దాక్కోలేదు. నేను న్యాయపోరాటం చేస్తున్నాను. నాకు న్యాయం జరిగే వరకూ చేస్తూనే వుంటాను. జనసేన విచారణ కమిటీ నుంచి నాకు ఎలాంటి పిలుపు రాలేదు.
ఐతే మీడియాలో వార్తల ప్రకారం, కమిటీ నన్ను పిలిచిందనీ, నేను రాలేదని ప్రచారం జరుగుతోంది. నన్ను ఏ కమిటీ ఇంతవరకూ సంప్రదించలేదు. పిలిచినా నేను వెళ్లలేదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఆపండి. నేను హరిప్రసాద్ గారికి ఓ లేఖతో పాటు పెన్ డ్రైవ్ పంపాను. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారిని కలవాలని అనుకుంటున్నాను. ఆయన నాకు తప్పక న్యాయం చేస్తారన్న నమ్మకం వుంది.
అందుకే ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఈలోపు ఏవేవో ప్రచారం చేస్తున్నారు. నేను ఇంతకంటే దిగజారేది ఏమీ లేదు. ఒక ఆడపిల్ల ఇలా బహిరంగంగా బైటకొచ్చి తనకు జరిగిన అన్యాయం చెబుతుందంటే అర్థం చేసుకోండి అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.
