సంబంధిత వార్తలు
- బలపడిన డాలర్.. తగ్గిన బంగారం ధరలు
- పాస్పోర్టు కేవలం ప్రయాణ పత్రం మాత్రమే.. పౌరసత్వ రుజువు కాదు : కేంద్రం
- జూలై నెలలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు
- రాం చరణ్ను న్యూ ఏజ్ మెగాస్టార్ అంటూ సంబోధించిన ప్రధాని మోడీ... చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
- Kleenkara : నాన్న అని పిలిచే.క్లీంకార పెద్ది విడుదలయ్యాక పెద్ది అని పిలుస్తోంది : రామ్ చరణ్
ప్రారంభోత్సవానికి భోగాపురం విమానాశ్రయం : మంత్రి రామ్మోనాయుడు
ఏపీలోని భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రకు నాంది పలుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులపై ఆయన మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలతో జీఎంఆర్ సంస్థ షెడ్యూల్ ప్రకారం నిర్మాణ పనులను పూర్తి చేసిందని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమయం ఖరారు చేస్తే వారి చేతుల మీదుగా ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుక ఉంటుందని తెలిపారు. 78 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ టెర్మినల్ భవనం సంవత్సరానికి ఏకంగా నాలుగు కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంటుందని చెప్పారు.
ఉత్తరాంధ్ర సంస్కృతి, కళలు ఉట్టిపడేలా డిజైన్ చేయడంతో ఇది దేశంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రారంభమైన వారం రోజుల లోపు విమానాశ్రయ కార్యకలాపాలను భోగాపురం నుంచి ప్రారంభించి, వచ్చే యేడాది మార్చి నాటికి పూర్తి స్తాయి సేవలు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
