సంబంధిత వార్తలు
- ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి: నారా లోకేష్
- హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ... పవన్ కళ్యాణ్ నివాసానికెళ్లి పరామర్శ
- బుల్లెట్ బండెక్కిన నారా లోకేష్.. ఏపీకి రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుందా? (video)
- టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్ - పసుపు జెండా పౌరుషం ఎన్నిటికీ తగ్గదు : చంద్రబాబు
- Nara Lokesh: విశాఖపట్నంలో తొలిసారిగా కేబుల్ ల్యాండింగ్ వ్యవస్థ.. నారా లోకేష్
ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర-20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యం.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే తన ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) కీలక పాత్ర పోషిస్తాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం తెలిపారు. రాష్ట్రం ఒక ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా రూపుదిద్దుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని లోకేష్ తెలిపారు. రాబోయే మూడు నెలల్లో కనీసం 100 ఆంధ్రప్రదేశ్ ఆధారిత కంపెనీలు ఎన్ఎస్ఈలో నమోదయ్యేలా చూడాలని ఆయన ఎంఎస్ఎంఈ విభాగాన్ని ఆదేశించారు.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ), ఏపీ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తంగా నిర్వహించిన ఎస్ఎంఈ ఐపీఓ వృద్ధికి ప్రత్యామ్నాయ నిధుల ఎంపిక" అనే అవగాహన సదస్సును ఉద్దేశించి లోకేష్ ప్రసంగించారు.
మేడ్ ఇన్ ఆంధ్ర- మేడ్ ఫర్ ఇండియా- మేడ్ ఫర్ ది వరల్డ్ అనే దార్శనికతతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని లోకేష్ పేర్కొన్నారు. 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే ఆలోచనకు, తన యువగళం పాదయాత్రలో ఎదురైన అనుభవాలే స్ఫూర్తి అని లోకేష్ పేర్కొన్నారు.
