శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 జులై 2014 (14:51 IST)

తప్ప తాగించాడు.. మోడల్ ఒంటిపై నగలన్నీ దోచేశాడు.!

హైదరాబాదుకు ముంబై మోడల్స్‌కు ఏదో విడదీయరాని లింక్ ఉన్నట్లుంది. హైదరాబాదులో ముంబై మోడల్స్ ఎప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నారు. తాజాగా సినిమా అవకాశం మోజులో పడి దోపిడీకి గురైన ముంబై మోడల్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని ఆశచూపి.. బాగా తాగించి ఆమె స్పృహ కోల్పోయాక ఒంటిపై ఉన్న నగలన్నీ దోచుకున్నాడు. దీనిపై సికింద్రాబాదు గోపాలపురం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన మోడల్ సుబ్రతా దత్తా (25)కు నెట్ ద్వారా సికింద్రాబాద్ కార్ఖానాకు చెందిన రాజు పరిచయమయ్యాడు. యువకుడి మాటలు నమ్మి ఆమె పూణే నుంచి సికింద్రాబాదుకు వచ్చింది. కార్ఖానాలోని తన నివాసంలో ఆమెకు అతను రెండు రోజులు ఆశ్రయమిచ్చాడు. నిత్య మద్యం తాగుతూ ఆమెతో కూడా తాగించాడు. 
 
గురువారంనాడు బ్యూటీ పార్లర్‌కు తీసుకుని వెళ్లి కారులో వస్తుండగానే ఆమెకు మద్యం ఇచ్చాడు. అందులో మత్తు మందు కలిపాడు. దాంతో ఆమె స్పృహ తప్పింది. ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను తీసుకుని రాజు ఆమెను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వదిలేసి పోయాడు. కొద్ది గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన మోడల్ రాజుపై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.