గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By IVR
Last Modified: శనివారం, 5 జులై 2014 (22:34 IST)

తిరుమల శ్రీవారి సేవలో సింగపూర్ విదేశాంగ మంత్రి

సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ కె షణ్ముగం శనివారంనాడు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఓ సామాన్య భక్తుడిలా అలిపిరి కాలినడకన సింగపూర్ విదేశాంగ మంత్రి శ్రీ వేంకటేశ్వరుని ఏడుకొండలపైకి వచ్చారు. 
 
అంతేకాదు సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే వీక్యుసి 1 క్యూలోనే వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుమల జేఈఒ శ్రీ కె.ఎస్.శ్రీనివాస రాజు విదేశీ భక్తులకు ఇచ్చే గౌరవమర్యాదలతో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 
 
అంతకుముందు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అక్కడ తిరుపతి జేఈఒ శ్రీ పి భాస్కర్ మంత్రికి ప్రసాదాలు అందించారు.