గురువారం, 12 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 ఫిబ్రవరి 2026 (17:29 IST)

Telangana: మహబూబ్‌నగర్‌లో ర్యాలీలో బీజేపీ చీఫ్ నితిన్ నబిన్

nithin nabin
బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ బుధవారం మహబూబ్‌నగర్‌లో జరిగే ఒక ర్యాలీలో తెలంగాణలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. గత నెలలో బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నబిన్ తెలంగాణలో పర్యటించడం ఇదే తొలిసారి. 
 
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉంది. నితిన్ నబీన్ బహిరంగ సభతో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అవకాశాలు మెరుగుపడతాయని తెలంగాణ బీజేపీ ఆశాభావంతో ఉంది. 
 
గత నెలలో పార్టీ రహిత ప్రాతిపదికన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచిన తర్వాత, పట్టణ ఎన్నికల్లో కూడా ఆకట్టుకునే విజయాలు సాధించాలని బీజేపీ ఆశిస్తోంది. తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 
 
కాషాయ పార్టీ 2023 అసెంబుల్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే సంఖ్యలో నియోజకవర్గాలను గెలుచుకుంది. 2025లో రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్నప్పటికీ, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయి బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.